త్వరలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం: హోంమంత్రి

by  |
త్వరలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం: హోంమంత్రి
X

దిశ, క్రైమ్ బ్యూరో: దాదాపు రూ.800 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ భవనం వచ్చే ఏడాదిలో ప్రారంభం అవుతోందని హోం మంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్ పెట్రోలింగ్ వాహనాలకు సుమారు రూ.700 కోట్లు కేటాయించామని తెలిపారు. నగరంలోని గోల్కొండ, ఆసిఫ్‌నగర్, హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ టీవీ కెమెరాలను గురువారం హోం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశలలో మొత్తం 27వేల మందిని నియామకం చేసుకుని పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసుకున్నామని అన్నారు. మహిళల భద్రతలో భాగంగా పోలీసు నియామకాలలో 33శాతం తప్పనిసరిగా పోస్టులు కేటాయిస్తున్నట్టు చెప్పారు.


Next Story

Most Viewed