కలెక్టర్ సుడిగాలి పర్యటన.. అలసత్వం వహిస్తే చర్యలు

by  |
కలెక్టర్ సుడిగాలి పర్యటన.. అలసత్వం వహిస్తే చర్యలు
X

దిశ, జుక్కల్‌: కామారెడ్డి జిల్లా మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలో జిల్లా పరిపాలనాధికారి శరత్ సుడిగాలి పర్యటన చేశారు. శుక్రవారం ఉదయం పిట్లం జుక్కల్ మండలాల్లో ఆయన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ధి పనులపై పంచాయతీ కార్యదర్శుల సమీక్ష నిర్వహించారు. ఆగస్టు ముప్పై ఒకటిలోగా పల్లె ప్రగతి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.


Next Story

Most Viewed