లాక్‎డౌన్‎లో వారి సేవలు వెలకట్టలేనివి: కలెక్టర్

by  |
లాక్‎డౌన్‎లో వారి సేవలు వెలకట్టలేనివి: కలెక్టర్
X

దిశ, నిజామాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇంటికి పరిమితమైనప్పటికీ.. వారికి నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఉద్యోగులు చేసిన సేవలు వేల కట్టలేనివి అని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. టిఎస్ఎన్ పిడిసిఎల్ నిజామాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీహాల్‌లో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు కరోనా లాక్‎డౌన్ సమయంలో కూడా పట్టణప్రగతి, పల్లెప్రగతిలో భాగంగా చాలా బాగా పనిచేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా.. రక్త నిల్వలు తగ్గిపోతున్న సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.



Next Story