సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి : కలెక్టర్

by  |
సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి : కలెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా రుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 98,801 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 93,800 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలు కృష్ణాజిల్లా జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఎలాంటి ప్రమాదం జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అంతేగాకుండా వరద ఉధృతి నేపథ్యంలో పుణ్య స్నానాలకు వెళ్లొద్దని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.



Next Story

Most Viewed