రామన్నపేటలో కలెక్టర్ పర్యటన

by  |
రామన్నపేటలో కలెక్టర్ పర్యటన
X

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో.. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు. హరితహారంలో భాగంగా ఐదో విడతలో నిర్వహించే మొక్కలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నర్సరీల నిర్వహణకు కేటాయించిన నిధులు సకాలంలో అందుతున్నాయా లేదా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రామన్నపేట, సిరిపురం, వెల్లంకి తదితర గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ దామాలను పరిశీలించి.. త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


Next Story

Most Viewed