డ్రైనేజీల వద్ద క్రాకర్స్ కాలుస్తున్నారా.. అయితే మీ పిల్లలు డేంజర్‌లో ఉన్నట్లే!

by  |
Fire accident
X

దిశ, డైనమిక్ బ్యూరో : దీపావళి వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఇంటిల్లిపాదీ సందడిగా గడుపుతుంటారు. ఇక పిల్లలైతే పండుగకు వారం రోజుల ముందు నుంచే బాణసంచా కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, దీపావళి వేళ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం ఉన్న పట్టణాల్లో బాణసంచా కాల్చే సమయంలో మరింత జాగ్రత్త అవసరం అంటున్నారు.

డ్రైనేజీ వ్యర్థాల ద్వారా తయారయ్యే మిథేన్ వాయువు అగ్నిని పుట్టిస్తుంది. అందువల్ల పిల్లలు తెలియకుండా బాణసంచా కాల్చడం, పేపర్లను కాల్చే సమయంలో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు క్రాకర్స్ పేల్చే సమయంలో తల్లిదండ్రులు దగ్గరుంటే మేలు. అయితే, గతంలో ఇలాంటి ప్రమాదాలు పలు చోట్లు జరిగాయి. డ్రైనేజీ మ్యాన్ హోల్ వద్ద పిల్లలు తెలియకుండా బాణసంచాను పేల్చే క్రమంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.


Next Story

Most Viewed