- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో : దీపావళి వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఇంటిల్లిపాదీ సందడిగా గడుపుతుంటారు. ఇక పిల్లలైతే పండుగకు వారం రోజుల ముందు నుంచే బాణసంచా కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, దీపావళి వేళ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం ఉన్న పట్టణాల్లో బాణసంచా కాల్చే సమయంలో మరింత జాగ్రత్త అవసరం అంటున్నారు.
డ్రైనేజీ వ్యర్థాల ద్వారా తయారయ్యే మిథేన్ వాయువు అగ్నిని పుట్టిస్తుంది. అందువల్ల పిల్లలు తెలియకుండా బాణసంచా కాల్చడం, పేపర్లను కాల్చే సమయంలో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు క్రాకర్స్ పేల్చే సమయంలో తల్లిదండ్రులు దగ్గరుంటే మేలు. అయితే, గతంలో ఇలాంటి ప్రమాదాలు పలు చోట్లు జరిగాయి. డ్రైనేజీ మ్యాన్ హోల్ వద్ద పిల్లలు తెలియకుండా బాణసంచాను పేల్చే క్రమంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
డ్రైనేజీ లైన్లు మీథేన్ వాయువును విడుదల చేస్తాయి, డ్రైనేజీ లైన్ల దగ్గర గల కవర్లపై లేదా డ్రైనేజీ లైన్ల సమీపంలో క్రాకర్లను వెలిగించినపుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కావున డ్రైనేజీ లైన్ల దగ్గర క్రాకర్లను వెలిగించకూడదని మన పిల్లలకు తెలియజేయాలి. pic.twitter.com/sgfwMuwLKJ
— Sushil Rao (@sushilrTOI) November 3, 2021