- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, భూపాలపల్లి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వలన సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్లోకి భారీగా వరద వచ్చి చేరింది. దీంతో ఓపెన్ కాస్ట్లో పనులు ఆగిపోయాయి. ప్రతిరోజూ సుమారు 4200టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి కాకపోవడంతో సింగరేణికి కోట్లలో నష్టం సంభవించింది. 7,500 మంది కార్మికులకు ఓపెన్ పనికి వెళ్ల లేకపోయారు.
వర్షం ఇలానే ఉంటే మరో రెండు రోజుల పాటు ఓపెన్ కాస్ట్ లో బొగ్గు నిలిచిపోయి భారీ నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గణపురం మండలం వెళ్తుర్ల పల్లి ,అప్పయ్యపల్లి గ్రామాల మధ్య మోరంచ వాగు పొంగి ప్రవహించడంతో 10 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రి మొత్తం చుట్టూ నీరు చేరుకోవడంతో ఆస్పత్రిలోకి అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది. రోగులు సిబ్బంది ఆసుపత్రిలోకి వెళ్లే వీలు లేకుండా ఉంది.