మల్లన్న సాగర్‌ను సందర్శించిన స్మితా సబర్వాల్ 

by  |
Smita Sabharwal
X

దిశ, కొండపాక : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం గ్రామ శివారులోని మల్లన్న సాగర్ పనులను సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ మంగళవారం సందర్శించారు. ఆమె మల్లన్న సాగర్ నుంచి మిషన్ భగీరథకు వెళ్లే పంప్ హౌస్ పనులను పరిశీలించారు. అనంతరం మల్లన్న సాగర్ కట్ట పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed