అంతర్వేదికి సీఎం జగన్.. కొత్త రథం ప్రారంభం

by  |
అంతర్వేదికి సీఎం జగన్.. కొత్త రథం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్ : తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. రథసప్తమి వేడుకల్లో భాగంగా కొత్తగా నిర్మించిన స్వామి వారి రథాన్ని ప్రారంభించారు.

గతంలో అంతర్వేది ఆలయ రథానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ వ్యాప్తంగా హిందూ సంఘాలు, మఠాధిపతులు పొలిటికల్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆలయ రథాన్ని ఏపీ ప్రభుత్వం కొత్తగా పునర్:నిర్మించింది.


Next Story

Most Viewed