సీఎం సంచలన ప్రకటన.. ఒక్కో వీరుడికి రూ.కోటి పరిహారం

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దూబే అనుచరులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన ఎనిమిది మంది పోలీసుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు పెన్షన్‌తో పాటు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. పోలీసుల మృతుకి కారణమైన వారిని వదలిపెట్టమని దూబే గ్యాంగ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని సీఎం నైతిక బాధ్యత [&hellip;]</p>

సీఎం సంచలన ప్రకటన.. ఒక్కో వీరుడికి రూ.కోటి పరిహారం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాంగ్‌స్టర్ వికాస్‌ దూబే అనుచరులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన ఎనిమిది మంది పోలీసుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు పెన్షన్‌తో పాటు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. పోలీసుల మృతుకి కారణమైన వారిని వదలిపెట్టమని దూబే గ్యాంగ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు.

Next Story