ఆర్జేడీ యువనేతకు సీఎం నితీష్ సలహా.. ఇలా చేస్తే చాలు!

by  |
ఆర్జేడీ యువనేతకు సీఎం నితీష్ సలహా.. ఇలా చేస్తే చాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దసరా తర్వాత ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కీలక నాయకులు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ పార్టీ నేత తేజస్వియాదవ్ వరుస ప్రచారాలు నిర్వహిస్తున్నాడు. అధికారపార్టీ నేతలను, ముఖ్యమంత్రి వైఫల్యాలను ఎత్తిచూపుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాడు. అయితే, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా స్పందించి.. తన పెద్దరికాన్ని నెలబెట్టుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఆర్జేడీ యువనేత చాలా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆయనకు గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి సీఎం నితీశ్ కుమార్ చిన్న చిట్కా చెప్పారు.

”ప్రతి రోజూ వేడి నీటిని బాగా తీసుకోవాలని సూచించారు. ఈ సలహా తనకు జార్జ్ ఫెర్నాండేజ్ ఇచ్చారు. ఆయన సలహా ఇవ్వనంత వరకూ నేనూ చల్లటి నీటినే తాగేవాణ్ని.” అని నితీశ్ తేజస్వీకి సలహా ఇచ్చారు. ఈ ఘటన దివంగత రాం విలాస్ పాశ్వాన్ ”దశ దినకర్మ” సందర్భంగా చోటు చేసుకుంది. రాం విలాస్ దశదిన కర్మను పురస్కరించుకొని సీఎం నితీశ్ ఆయన నివాసానికి వెళ్లగా.. దానికి తేజస్వీ ప్రజెంట్ అయ్యారు.



Next Story

Most Viewed