ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్‌

by  |
CM KCR Yadadri Tour
X

దిశ, తెలంగాణ బ్యూరో : కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించిన ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు , సిద్దిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి, 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ట్వీట్ చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించి పార్టీకి తిరుగులేదని మరోమారు నిరూపించారని సీఎం పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ అని తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇంతటి అద్భుత విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ ట్విట్టర్ వేదికగా సోమవారం ధన్యవాదాలు తెలిపారు.


Next Story

Most Viewed