రేపు వ‌రంగ‌ల్‌కు సీఎం.. ఎంజీఎం, సెంట్ర‌ల్‌జైల్‌ సందర్శించ‌నున్న కేసీఆర్‌

by  |
రేపు వ‌రంగ‌ల్‌కు సీఎం.. ఎంజీఎం, సెంట్ర‌ల్‌జైల్‌ సందర్శించ‌నున్న కేసీఆర్‌
X

దిశ, వ‌రంగ‌ల్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈనెల 21న వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈసంద‌ర్భంగా శుక్ర‌వారం ఎంజీఎం ఆస్ప‌త్రితో పాటు సెంట్ర‌ల్ జైలును ముఖ్య‌మంత్రి సంద‌ర్శిస్తార‌ని అధికారులు వెల్ల‌డించారు. వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రిలోని కోవిడ్ రోగుల‌కు అందుతున్న వైద్యాన్ని, ఆస్ప‌త్రిలోని స‌దుపాయాల‌పై ముఖ్య‌మంత్రి నేరుగా ప‌రిశీలించనున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంజీఎంను సంద‌ర్శించ‌నున్న‌నేప‌థ్యంలో గురువారం సాయంత్రం రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు వైద్యాధికారుల‌తో ఆస్ప‌త్రిలో భేటీ అయ్యారు. ఎంజీఎంతో పాటు, సెంట్ర‌ల్ జైలును సంద‌ర్శించి ప‌రిశీలించారు. మంత్రి ద‌యాక‌ర్‌రావు ఈ సంద‌ర్భంగా పీపీటీ కిట్ ధ‌రించి నేరుగా కోవిడ్ వార్డులో ప‌ర్య‌టించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed