నేడు సిరిసిల్లకు సీఎం కేసీఆర్.. షెడ్యూల్ వివరాలు ఇవే

by  |
cm-kcr-bus 1
X

దిశ, సిరిసిల్ల : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు, పోలీసు యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది. ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన తన ప్రత్యేక బస్సులో సిరిసిల్లకు కేసీఆర్ బయలు దేరనున్నారు. ఉదయం 11.30 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి 15 మంది లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా పట్టాలు అందజేస్తారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభిస్తారు. 12.45 గంటలకు సిరిసిల్లలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనం, 1.10 గంటలకు సిరిసిల్ల మండలం సర్ధాపూర్లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రారంభిస్తారు. అనంతరం 1.40 గంటలకు ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్(కలెక్టరేట్) భవనాన్ని ప్రారంభించిన అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ఆ తర్వాత రగుడులో భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.



Next Story

Most Viewed