- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద మేడ్చల్ పంచాయితీ తెగింది. టీఆర్ఎస్ నూతన కమిటీల ఎంపిక విషయమై మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, జడ్పీఛైర్మన్ అయిన తనను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఇటీవలే శరత్ చంద్రా రెడ్డి రాజీనామాకు సిద్ధ పడిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రితో పాటు జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రా రెడ్డిని సీఎం తన వద్దకు పిలిపించుకుని మాట్లాడినట్లు తెలిసింది.
దీంతో జడ్పీఛైర్మన్ మంత్రి తనను లెక్క చేయడం లేదని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, తన సొంత మండలంలో సమచారం లేకుండా కమిటీ వేశారని, దీంతో మనస్థాపానికి గురై రాజీనామా చేయాలనుకున్నట్టు జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రా రెడ్డి సీఎంకు వివరించినట్లు తెలిసింది. దీంతో మంత్రి మల్లారెడ్డిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు సమాచారం. జిల్లాలో అందరినీ కలుపుకుని పోయి పార్టీ పటిష్టతకు పాటు పడాలని, గ్రూపు రాజకీయాలకు తావులేదని సీఎం మందలించినట్లు తెలిసింది. జడ్పీ ఛైర్మన్తో పాటు ముఖ్య నాయకులను కలుపుకుని పోయి పార్టీ పటిష్టతకు పాటు పడాలని సీఎం మంత్రి మల్లారెడ్డిని అదేశించినట్లు తెలిసింది. ఇంతకాలం మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఉత్కంఠకు సీఎం చొరవతో తెరపడినట్లైంది.