ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

by  |
CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యద‌ర్శి ఎస్వీ ప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. చంద్రబాబు స‌హా ప‌లువురు ముఖ్యమంత్రుల‌కు కార్యద‌ర్శిగా ప‌నిచేసిన ఎస్వీ ప్రసాద్.. నిబ‌ద్ధత క‌లిగిన ఉన్నతాధికారిగా గుర్తింపు పొందారు. కాగా, ఆయన మరణవార్త తెలిసిన చంద్రబాబు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించగా, తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన చేసిన సేవలను కొనియాడారు.



Next Story

Most Viewed