మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

by  |
మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వైఎస్ మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విషిష్ట సేవలందించారన్నారు. అంతేకాకుండా ఆర్థిక శాఖకు మంచి పేరును తీసుకురావడంతో పాటు సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారని, ఏ బాధ్యతలైనా సమర్థవతంగా నిర్వహించేవారని గుర్తు చేసుకున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రోశయ్య మృతి పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి సంతాపం

Next Story

Most Viewed