మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్

by  |
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ ఆదివారం రాష్ట్ర ఎక్సై్జ్, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ దశ దినకర్మకు హాజరయ్యారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్‌లో జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మె్లే డాక్టర్ సీ. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ నేరుగా పాలకొండ సమీపంలోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు సీఎంకు స్వాగతం పలికారు. సీఎం నేరుగా మంత్రి తల్లి శాంతమ్మ సమాధి వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తన తల్లిదండ్రులను గురించి సీఎంకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం సీఎం.. మంత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.


Next Story

Most Viewed