- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎంను సందర్శించారు. ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు ఉన్నారు. వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఎంజీఎంలోని సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కరోనా రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడిగారు. వారికి ధైర్యం చెబుతూ కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులను కేసీఆర్ పరిశీలించారు. వరంగల్ పర్యటనలో భాగంగ ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఔషధాలపై సీఎం కేసీఆర్ చర్చించారు. ఎంజీఎం పర్యటన అనంతరం వరంగల్ సెంట్రల్ జైలును పరిశీలించి, జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో కొత్త ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో మాట్లాడతారు. ఇటీవలే కేసీఆర్ సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా రోగులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.