ఈ నెల 28న సీఎం కేసీఆర్ సభ

by  |
ఈ నెల 28న సీఎం కేసీఆర్ సభ
X

దిశ, వెబ్‎డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రచార జోరు పెంచింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నెల 28వ తేదీన ప్రచారసభలో పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు పరిశీలించారు. గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తొలిసారి ప్రచారసభలో పాల్గొననున్నారు.

కాగా, కొవిడ్ ప్రోటోకాల్‎తో టీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించనున్నారు. స్టేడియం ఎంట్రీ దగ్గర లక్ష మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి డివిజన్ నుంచి మూడు వేల మంది సభలో పాల్గొననున్నారు.



Next Story