తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

by  |
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తాజాగా తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు మేలు చేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా, తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఇంటర్ , డిగ్రీ కాలేజీల్లోనూ ఈ పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డ్రాపౌట్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిరుపేద విద్యార్థులను చదువుకు దగ్గర చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

Next Story

Most Viewed