కొండపోచమ్మను దర్శించుకున్న సీఎం కేసీఆర్

by  |
కొండపోచమ్మను దర్శించుకున్న సీఎం కేసీఆర్
X

దిశ, మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధిపేట జిల్లా పర్యటన కొనసాగుతోన్నది. శుక్రవారం ఉదయం తీగుల్ నర్సాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు .. కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చండీ హోమంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ మర్కుక్ పంప్ హౌజ్ కు చేరుకుని పంప్ హౌజ్ ప్రారంభించారు. మర్కుక్, ఎర్రవెల్లిలో రైతు వేదికల పనులకు శంఖుస్థాపన చేశారు. సీఎం వెంటా రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.



Next Story