సిరిసిల్ల సిత్రం.. బుల్లి మగ్గంపై మెరిసిన తండ్రి, తనయుడు

by  |
cm-kcr-and-ktr
X

దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణ పరిధిలోని చంద్రంపేటకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ బుల్లి మగ్గంపై అద్భుతాలు సృష్టిస్తూ అందరి దృష్టినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. పలువురు రాజకీయ నాయకుల ముఖ చిత్రాలు మగ్గంపై నేస్తూ తన ప్రతిభను చాటుతున్నాడు. అంతేకాకుండా ఆ బుల్లిమగ్గంపైనే చీరలు కూడా నేస్తున్నాడు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫోటోలను బుల్లి మగ్గంపై నేసి అందరినీ అలరించాడు. ఆదివారం సీఎం కేసీఆర్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా బుల్లి మగ్గంపై నేసిన వారి ఫోటోలను కేసీఆర్‌కు అందజేయనున్నట్లు హరిప్రసాద్​ తెలిపాడు.

Next Story