రేపే ప్రమాణస్వీకారం.. తర్వాత కలుద్దామన్న సీఎం..!

by  |
రేపే ప్రమాణస్వీకారం.. తర్వాత కలుద్దామన్న సీఎం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్​ (టీఎస్‎పీఎస్‎​సీ) కొత్త పాలకవర్గం శుక్రవారం కొలువుదీరనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని టీఎస్‎పీఎస్‎​సీకి సమాచారమిచ్చారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన జనార్దన్​రెడ్డితో పాటుగా ఏడుగురు సభ్యులు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాతే పదవీ బాధ్యతలు చేపట్టాలనుకున్నారు. కానీ, ప్రస్తుతం సీఎం కేసీఆర్​అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలోనే తర్వాత కలుద్దామని, ముందుగా పదవీ బాధ్యతలు స్వీకరించాలని సీఎం కేసీఆర్​ కొత్త పాలకవర్గానికి సూచించారు. దీంతో ముహుర్తాలన్నీ చూసుకున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయమే ప్రమాణస్వీకారం చేసేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని టీఎస్‌పీఎస్సీ అధికారులకు గురువారం ఉదయమం ఆదేశాలిచ్చారు. దీంతో రేపు టీఎస్​పీఎస్సీలో 8 మంది పాలకవర్గం ఒకేసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Next Story

Most Viewed