కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ

by  |
jagan-cm
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. బహ్రెయిన్‍లోని ఓ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం చేతిలో చాలామంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. బాధితులను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని సీఎం జగన్ కోరారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం జగన్ లేఖలో హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed