బాలుకు ‘భారత రత్న’ ఇవ్వండి

by  |
బాలుకు ‘భారత రత్న’ ఇవ్వండి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి సోమవారం లేఖ రాశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు ‘భారత రత్న’ ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడి దాదాపు 40రోజులు చెన్నైలోని ఎంజీఎంలో చికిత్స పొందుతూ శుక్రవారం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నూమూసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. లెజండరి సింగర్‌ ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం బాలుకు భారతరత్న ఇవ్వాలని లేఖ రాశారు. ఈక్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీనికి లేఖ రాసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని కోరారు. అటు ఎస్పీ బాలుకు భారతరత్నపై స్పందించిన చరణ్.. నాన్నకు భారతరత్న వస్తే సంతోషిస్తానని పేర్కొన్నారు.


Next Story

Most Viewed