కూతురు కోసం బెంగళూరుకు సీఎం జగన్

by  |
కూతురు కోసం బెంగళూరుకు సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దకుమార్తె హర్షారెడ్డి చదువులో మెరీట్ స్థాయిలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు పారిస్‌లోని ప్రముఖ విద్యా సంస్థ అయిన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో సీటు దక్కింది. ఇదివరకు హర్షారెడ్డి ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మాస్టర్స్ డిగ్రీ కోసం ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌‌లో ఆమె తదుపరి విద్యాబ్యాసం చేయనున్నారు. అయితే, కుమార్తెను పారిస్ పంపేందుకు మంగళవారం సీఎం జగన్ బెంగళూరుకు వెళ్తున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed