సీఎం ఆదేశించారని.. నేను చెబుతున్నా..

by  |
సీఎం ఆదేశించారని.. నేను చెబుతున్నా..
X

దిశ, అమరావతి బ్యూరో: విజయవాడ అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడ అభివృద్ధిపై ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సింగ్ నగర్ లో రూ.10 కోట్లతో మోడల్ పార్కు అభివృద్ధికి శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్రంలో పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షం అడ్డుకుంటుదని ఆరోపించారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యరని అన్నారు. కోర్టుల నుండి స్టే లు తీసుకు వచ్చి కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్ళ నిర్మాణ కార్యక్రమంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 400 కోట్లు ఆదా చేశామని వివరించారు.



Next Story

Most Viewed