వారంతా చిక్కుకుపోయారు.. వెనక్కి రప్పించండి

by  |
వారంతా చిక్కుకుపోయారు.. వెనక్కి రప్పించండి
X

దిశ ఏపీ బ్యూరో: కువైట్‌లో చిక్కుకుపోయిన ఏపీ కార్మికులను విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలకు నేరుగా విమానాలను ఏర్పాటు చేయాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్ లేఖ రాశారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు చేపట్టిన ‘వందే భారత్ మిషన్’ ప్రశంసనీయమని అభినందించారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో వేలాది మంది భారతీయులు వెనక్కి వస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం కువైట్‌లో ఉన్న వలస కూలీలంతా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, అరకొర భోజనం, కనీస సదుపాయాలు లేకుండా రెండు వారాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా స్వదేశం చేరాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. స్వదేశం చేరేందుకు ప్రయాణ ఖర్చును భరించే స్థితిలో కూడా వారు లేరని, ఇమ్మిగ్రేషన్ ఫీజును మాఫీ చేసి, వారందరికీ ఎగ్జిట్ క్లియరెన్స్‌ను మన దేశ రాయబార కార్యాలయం ఇచ్చిందని జగన్ లేఖలో పేర్కొన్నారు.

వారి ప్రయాణ ఖర్చును భరించేందుకు కువైట్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. వెంటనే కువైట్‌లో ఉన్న హైకమిషనర్‌కు సూచనలు చేసి, ఏపీకి విమానాలు ఏర్పాటు చేసేలా చూడాలని విన్నవించారు. తిరిగి వచ్చే వలస కూలీలకు అవసరమైన వైద్య పరీక్షలను నిర్వహించి, వారిని క్వారంటైన్‌కు పంపించడానికి అన్ని సదుపాయాలను సిద్ధంగా ఉంచామని జగన్ తెలిపారు.



Next Story

Most Viewed