సీఎం మాట నిజమయ్యేలా ప్రస్తుత పరిస్థితులు : సజ్జల

by  |
సీఎం మాట నిజమయ్యేలా ప్రస్తుత పరిస్థితులు : సజ్జల
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోందని మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం సాధ్యమైనంత వరకు చర్యలు చేపడుతోందన్నారు. అయితే, ఈ సమయంలో కరోనా వారియర్స్ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా విపక్షాలు ఆరోపణలు చేస్తుండటం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ విధించాలన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయని అన్నారు.

కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉన్న సమయంలో చంద్రబాబు విద్యార్థులు, ఉద్యోగులను రెచ్చగొట్టేలా రాజకీయాలు చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు గానే ప్రజలు కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.



Next Story