కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్

by  |
కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం వైఎస్సార్ ఘాట్‌లో సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. అనంతరం పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్, బస్సు డిపోలకు శంకుస్థాపన చేయనున్నారు. గండికోట-చిత్రావతి, గండికోట-పైడిపాలెం ఎత్తిపోతల పథకాలకు భూమి పూజ నిర్వహించనున్నారు. ముద్దనూరు రోడ్డులోని ఏపీక్లార్‌లో ఇర్మా ఏపీకి శంకుస్థాపన చేయనున్నారు.

తర్వాత అపాచీ లెదర్ డెవలప్‌మెంట్ పార్క్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. పులివెందులలో వైఎస్సార్ జగనన్న హౌసింగ్ లేఅవుట్‌ను పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రి ఇడుపులపాయలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

Next Story

Most Viewed