మహిళల అభ్యున్నతికి ఆయన కృషి చేస్తున్నారు.

by  |
మహిళల అభ్యున్నతికి ఆయన కృషి చేస్తున్నారు.
X

దిశ, వెబ్ డెస్క్: మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతూ మహిళలు బైక్ ర్యాలీ తీశారు. మహిళల బైక్ ర్యాలీని హోం మంత్రి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్‌లో మహిళలకు 50శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించారని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, సున్నావడ్డీ, వైఎస్ఆర్ ఆసరా వంటి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. ఇండ్ల పట్టాలు కూడా మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పారు.


Next Story

Most Viewed