మద్దతు ధరకు ధాన్యం కొంటాం

by  |
మద్దతు ధరకు ధాన్యం కొంటాం
X

దిశ, ఏపీ బ్యూరో: రైతుల నుంచి కనీస మద్ధతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు, మార్కెట్‌ గోడౌన్ల నిర్మాణంపై మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ కనీస మద్దతు ధర కన్నా తక్కువ వస్తుంటే వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంటలకు కనీస మద్దతు ధరలను ఆర్‌బీకేల్లో ప్రదర్శించాలని చెప్పారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 10రోజుల్లోగా నగదు చెల్లించాలన్నారు.


Next Story

Most Viewed