ఒక్కో ఇంటికి రూ. 2 వేలు: జగన్

by  |
ఒక్కో ఇంటికి రూ. 2 వేలు: జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి వరద పరిస్థితులపై ఈ కాన్ఫరెన్స్ లో చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ. 2 వేలు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 10 రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయాలని జగన్.. కలెక్టర్లను ఆదేశించారు.

కాగా, గతకొద్ది రోజుల నుంచి ఏపీలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed