టీచర్ల బదిలీలకు గ్రీన్​సిగ్నల్

by  |
టీచర్ల బదిలీలకు గ్రీన్​సిగ్నల్
X

దిశ, ఏపీ బ్యూరో: మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. శనివారం దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తయిన టీచర్లు బదిలీలకు అర్హులుగా నిర్ణయించారు. బదిలీలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలతో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఏపీ గవర్నమెంటు ఎంప్లాయిస్ సమాఖ్య చైర్మన్​కే వెంకట్రామిరెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed