సీఎం జగన్ ఇగోయిస్టు, ఫ్యాక్షనిస్ట్ అన్న బీజేపీ కీలక నేత

by  |
సీఎం జగన్ ఇగోయిస్టు, ఫ్యాక్షనిస్ట్ అన్న బీజేపీ కీలక నేత
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి జగన్ ఒక ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అంటూ బీజేపీ సీనియర్ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో అమరావతి రైతులు చేపట్టిన మహోద్యమ సభలో పాల్గొనేందుకు వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణ ఇతర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం అమరావతి రైతులు భూములు ఇస్తే… దాన్ని అభినందించాల్సిందిపోయి సీఎం జగన్ వేధిస్తారా అంటూ ప్రశ్నించారు. రైతుల త్యాగాలను గుర్తించకుండా మూడు రాజధానుల పేరుతో ముందుకు వెళ్ళడం మూర్ఖత్వం కాదా అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా వారిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితులపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలోనే నెలకొందని మండిపడ్డారు. ప్రభుత్వం పెడుతున్న బాధలను భరిస్తూనే రైతులు తమ పాదయాత్రను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని మాజీమంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపించారు. ఏ దళితులైతే జగన్ ను అధికారంలోకి తీసుకొచ్చారో… అదే దళితులను నట్టేట ముంచారని మండిపడ్డారు. అదే దళితులు త్వరలోనే జగన్‌ను అధికారపీఠం నుంచి దించేందుకు సిద్ధంగా ఉన్నారని రావెల కిశోర్ బాబు హెచ్చరించారు.



Next Story

Most Viewed