తుఫానుపై సీఎం జగన్ సమీక్ష

by  |
తుఫానుపై సీఎం జగన్ సమీక్ష
X

దిశ, ఏపీ బ్యూరో: నివర్‌ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. అన్ని రకాలుగా సహాయక చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుఫాను తీరాన్ని తాకిందని, క్రమంగా బలహీనపడుతోందని సీఎం వెల్లడించారు. చిత్తూరులోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని, అలాగే కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు ప్రారంభమైనట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

నెల్లూరు జిల్లాలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని ముఖ్యమంత్రికి తెలిపారు. పెన్నాలో ప్రవాహం ఉండొచ్చని, సోమశిల ఇప్పటికే నిండినందున వచ్చే ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేస్తామని సీఎంఓ కార్యాలయ అధికారులు సీఎంకు తెలిపారు. అక్కడక్కడా పంటలు నీటమునిగిన ఘటనలు వచ్చాయని, వర్షాలు తగ్గగానే నష్టం మదింపు కార్యక్రమాలు చేపడతామన్నారు. రేణిగుంటలో మల్లెమడుగు రిజర్వాయర్‌ సమీపంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాకుతో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశాలు జారీచేశారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాల కారణంగా ఏదైనా నష్టం వస్తే సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని సీఏం ఆదేశించారు.



Next Story