త్యాగం, సహనానికి ప్రతీక బక్రీద్ పండుగ- సీఎం జగన్

by  |
jagan news
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రప్రజలకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని ఓ ప్రకటనలో తెలిపారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారని తెలిపారు. భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని వైఎస్ జగన్‌ ఆకాంక్షించారు.

Next Story

Most Viewed