షూటర్ అవని లేఖరాకు సీఎం జగన్ అభినందనలు

by  |
Avani Lekhara
X

దిశ, ఏపీ బ్యూరో: టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన షూటర్‌ అవని లేఖరాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్‌లో పసిడి సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా అరుదైన రికార్డు సాధించారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రాణిస్తూ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని సీఎం ఆకాంక్షించారు. అలాగే పారాలింపిక్స్‌లో సత్తా చాటుతున్న క్రీడాకారులందరికీ సీఎం జగన్‌ అభినందనలు తెలియజేశారు. టోక్యోలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారని కొనియాడారని… భవిష్యత్‌లో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్నారు. భారత్‌ ఖాతాలో ఇప్పటి వరకు 7 పతకాలు చేరాయని.. మరిన్ని మెడల్స్‌ సాధించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed