నా ప్రతీ అడుగులోనూ… నాన్న తోడుగా ఉన్నారు : జగన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద సీఎం జగన్ ఘనంగా నివాళ్లు అర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తండ్రిని స్మరించుకున్న సీఎం జగన్ ట్విట్టర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. ‘మా నాన్న మా నుంచి దూరమై నేటికి 11 ఏండ్లు దాటిందన్నారు. అంతటి మాహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని [&hellip;]</p>

నా ప్రతీ అడుగులోనూ… నాన్న తోడుగా ఉన్నారు : జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద సీఎం జగన్ ఘనంగా నివాళ్లు అర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తండ్రిని స్మరించుకున్న సీఎం జగన్ ట్విట్టర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశారు.

‘మా నాన్న మా నుంచి దూరమై నేటికి 11 ఏండ్లు దాటిందన్నారు. అంతటి మాహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని అన్నారు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ… నన్ను ముందుకు నడిపిస్తున్నారని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.

Next Story