ఎన్నికలకు సిద్ధం.. వ్యాక్సిన్ ఇవ్వకపోతే కేసులు పెరిగే చాన్స్ : జగన్

by  |
cm jagan
X

దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశమైంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై చర్చ అనంతరం.. వాటి నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ సంకేతమిచ్చారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో త్వరగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని, లేనియెడల కేసులు పెరిగే చాన్స్ ఉందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై సీఎంకు పలువురు మంత్రులు అభినందనలు తెలిపారు. లోకల్ వార్‌లో ఎప్పుడూ లేనంతగా 80 శాతం ఫలితాలు సాధించడం మంచి విషయమని ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ సమావేశంలో భాగంగా వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed