ఆస్తులు ప్రకటించిన సీఎం.. కారు విలువ రూ.8,905!

by  |
ఆస్తులు ప్రకటించిన సీఎం.. కారు విలువ రూ.8,905!
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజకీయ నాయకులు కొందరు ప్రతి ఏటా తన ఆస్తుల విలువను ప్రకటిస్తుంటారు. అప్పులు, ఆధాయం, బ్యాంక్ డిపాజిట్ల వివరాలను ప్రజల ముందు పెడుతుంటారు. అలాంటి నేతల్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఒకరు. ఆయన తన ఆస్తులను ప్రకటించారు. మార్చి 31, 2020 వరకు లెక్కలను చూపిన ఆయన.. తన ఆస్తి గత ఏడాది కంటే రూ.71 లక్షలు పెరిగినట్లు వెల్లడించారు.

2020 మార్చి 31 వరకూ నవీన్ పట్నాయక్ స్థిర, చరాస్తులు మొత్తం కలిపి రూ. 64.98 కోట్లుగా వెల్లడించారు. వీటిల్లో చరాస్తుల విలువ రూ.13,404,503.1 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ.63,64,15,261 కోట్లుగా ప్రకటించారు. అలాగే.. గత సంవత్సరం ఆయా బ్యాంకుల్లో సీఎం డిపాజిట్ చేసిన సొమ్ము రూ.60.45 లక్షలు కాగా, ఈ సంవత్సరం రూ.1.31 కోట్లుకు పెరిగినట్లు సీఎం వెల్లడించారు. సీఎం నవీన్ పట్నాయక్‌ కుటుంబానికి రూ.2,89,587 విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఆయనకు 1980 మోడల్‌కు చెందిన ఓ అంబాసిడర్ కారు ఉంది. ప్రస్తుతం దాని విలువ రూ.8,905 లుగా సీఎం వెల్లడించారు. కాగా సీఎం 2019 సంవత్సరం మార్చిలో ప్రకటించిన ఆస్తులతో పోల్చితే రూ.71 లక్షల ఆధాయం పెరిగినట్లు ఈ లెక్కలతో తేలింది.


Next Story

Most Viewed