2020లో ప్రజలు ఇబ్బంది పడ్డారు : భట్టి

by  |
2020లో ప్రజలు ఇబ్బంది పడ్డారు : భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: 2020వ సంవత్సరంలో కరోనా, వరదల కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఎవరినీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘ నాయకుడు టీఆర్ఎస్ గుర్తుపై గెలిచి మంత్రి అయ్యారని గుర్తుచేశారు. ఇలాంటి ఉద్యోగ సంఘ నేతలతో ఎవరికీ న్యాయం జరుగతని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. వెంటనే నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story