ఎదురుపడ్డ బీజేపీ-టీఆర్ఎస్..పరిస్థితి ఉద్రిక్తత

by  |
ఎదురుపడ్డ బీజేపీ-టీఆర్ఎస్..పరిస్థితి ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాలు పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఇటీవల ఆర్కేపురంలో ఎదురుపడ్డ బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇక ఈ రోజు నుంచే బీజేపీ నుంచి ప్రచారం షురూ చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీల్లో రోడ్ షో నిర్వహించారు. సరిగ్గా ఇదే సమయంలో టీఆర్ఎస్ నేతలు అదే రూట్‌లో ప్రచారం చేస్తున్నారు. దీంతో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య నినాదాలతో కూకట్‌పల్లి మార్మోగిపోయింది. గట్టిగా నినాదాలు చేయడమే కాకుండా తోపులాటలు జరిగాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువురు కార్యకర్తలను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.


Next Story

Most Viewed