ఎమ్మెల్యే ఎదుటే కొట్లాట.. నలుగురిపై కేసు

by  |
ఎమ్మెల్యే ఎదుటే కొట్లాట.. నలుగురిపై కేసు
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే ఎదుటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో విభేదాలు భగ్గుమన్నాయి. చాగల్లు రిజర్వాయర్‍కు జలహారతివ్వడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి మరోవర్గం వారు వచ్చారని తీవ్ర వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మెల్యే ఎదుటే బాహబాహీకి దిగారు.

దీంతో రవిప్రసాద్ రెడ్డితోపాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు.. ఈ కార్యక్రమానికి హాజరైనవారు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. ఎవరూ కూడా సామాజిక దూరం పాటించలేదు. మాస్కులు ధరించలేదు.

Next Story

Most Viewed