మారణాయుధాలతో రెండు వర్గాల ఘర్షణ 

by  |
మారణాయుధాలతో రెండు వర్గాల ఘర్షణ 
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అర్ధరాత్రి కర్రలతో, గొడ్డళ్లతో, మారణ ఆయుధాలతో దాడులకు పాల్పడ్డారు. గ్రామంలోని గంగాదరి వెంకట్రావు, అంబటి శ్రీను వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి.

ఇంటి ముందు మురుగు కాల్వ విషయంలో వివాదం ఘర్షణకు దారితీసింది. దాడిలో 10మందికి తీవ్రంగా గాయాలు కాగా మరో నలుగురుకి తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే గాయాలపాలైన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Next Story

Most Viewed