నర్సరావుపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

by  |
నర్సరావుపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. నడిరోడ్డుపై కారు ఆపి మరీ ఓ వర్గ యువకుడిపై మరో వర్గం యువకులు దాడి చేశారు. బాధిత యువకుడి తండ్రిపై రెండు నెలల క్రితం కత్తితో దాడికి పాల్పడ్డారు. పాతకక్షల నేపథ్యంలో వరుస దాడులకు పాల్పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story