- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జమ్మికుంట : దళిత బంధు ఆగిపోవడానికి బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కారణమంటూ ఆయన దిష్టిబొమ్మను టీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. అందుకు నిరసనగా బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో జరిగింది.
వివరాల ప్రకారం.. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధును కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి కారణం ఈటల రాజేందరే అంటూ.. ఆయన దిష్టిబొమ్మను టీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా ఇరువర్గాల మధ్య బాహాబాహితో పాటు తోపులాట చోటు చేసుకుంది. దీంతో, గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.