హైదరాబాద్ పోలీసులకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ విజ్ఞప్తి..

by  |
nv-ramana
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ పోలీసులకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విజ్ఞప్తి చేశారు. తాను పర్యటిస్తున్న సమయంలో నగరంలో ట్రాఫిక్ నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని ఆయన కోరారు. కాగా, ఆయన ఈనెల 19వ తేదీ వరకు రాజ్‌భవన్‌లో బస చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన యాదాద్రి పర్యటనకు వెళ్లి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఆంక్షల వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed