కార్మికులపై దాడులా.. అధికారులు ఏం చేస్తున్నరు?

by  |
కార్మికులపై దాడులా.. అధికారులు ఏం చేస్తున్నరు?
X

దిశ, జమ్మికుంట : విధి నిర్వహణలో ఉన్న కార్మికులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు అధికారులు చొరవ చూపకుండా.. చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ ఆరోపించారు. జమ్మికుంట మండలం కోరపల్లి పంచాయతీలో పంపు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపరచాడన్నారు.

దాడికి పాల్పడ్డ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడిని పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు దండిగారి సతీష్, పుల్లూరు రాములు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story